Total Pageviews
Wednesday, April 20, 2011
Tuesday, February 8, 2011
కాదేది కల్తికి అనర్హం

ఇటు డిస్టిలరీ.. అటు దుకాణ యాజమాన్యం చేతివాటం
ఎక్కువ నీటిని వినియోగిస్తున్న డిస్టిలరీలు
మూత తొలగించి నీళ్లు పోస్తున్న దుకాణదారులు
పలచనవుతున్న మద్యం
పెగ్గు మీద పెగ్గు కొట్టి నడిరోడ్డుమీద స్వర్గవిహారం చేసే మందు మహరాజుల్ని అప్పుడప్పుడూ అక్కడక్కడా చూస్తూనే ఉంటాం. కానీ ఈ మధ్య ఏ మందుబాబును కదిపినా ‘ఫుల్లు కొట్టినా కిక్కు లేదు గురూ’ అంటూ నిట్టూరుస్తున్నారు. మత్తెక్కించే మందులోనే తేడా ఉందని తెలియక జుట్టు పీక్కుంటున్నారు. రాష్టవ్య్రాప్తంగా దాదాపు 40 శాతం నీళ్లు కలిపిన కల్తీ మద్యాన్నే విక్రయిస్తున్నారని ఇటీవలి సంఘటనలు బయటపెడుతున్నాయి. డిస్టిలరీ యాజమాన్యం, మద్యం దుకాణదారులు ఒకరికి తెలియకుండా మరొకరు విచ్చలవిడిగా మద్యం సీసాలో నీళ్లు కలుపుతుండటంతో కిక్కు తగ్గిపోతోంది. ఈ దందా డిస్టిలరీల్లోనే మొదలవుతోంది. గతంలో సీగ్రాం ఉత్పత్తులు, ఇటీవలి కాలంలో ఆఫీసర్స్ చాయిస్, అరిస్ట్రోక్రాట్, అశోక విస్కీల కల్తీ వ్యవహారం బ్రాండెడ్ మద్యం లోగుట్టును బయటపెట్టాయి. ఎక్సైజ్ ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో డిస్టిలరీలు లిక్కర్ తయారీలో ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్ (ఈఎన్ఏ) శాతం తగ్గించి నీళ్లు కలుపుతున్నాయి. ఒక్క శాతం నీళ్లు అదనంగా ఉపయోగించినా డిస్టిలరీ యాజమాన్యానికి ’ లక్షల్లో ఆదాయం ఉంటుంది. రోజుకు ఐదు వేల కేసుల మద్యం ఉత్పత్తి చేయగలిగే డిస్టిలరీ నుంచి తయారైన మద్యంలో ఒక శాతం అదనంగా నీళ్లు కలిపితే 2,500 లీటర్ల ఈఎన్ఏ మిగులుతుంది. దీన్ని తిరిగి మద్యం తయారీ కోసం వినియోగిస్తే 275 కేసుల మద్యం ఉత్పత్తి అవుతుంది. లేదంటే మిగిలిన ఈఎన్ఏను నేరుగా విక్రయించినా 2,500 లీటర్లకు రూ.1.20 లక్షలు (లీటర్ ధర రూ.48 చొప్పున) వస్తాయి. ఈ అదనపు లాభాలకోసమే డిస్టిలరీల యాజమాన్యాలు కల్తీకి పాల్పడుతున్నాయి. ప్రస్తుతం రాష్ర్టంలో ఉన్న అన్ని డిస్టిలరీలు కూడా సగటున రోజుకు 10 వేల కేసుల మద్యం ఉత్పత్తి చేయగలిగే సామర్థ్యం ఉన్నవే.
మూత తీసి... నీళ్లు పోసి
డిస్టిలరీల నుంచే కల్తీతోవస్తున్న మద్యంపై దుకాణదారులు కూడా తమ చే తివాటాన్ని చూపుతున్నారు. ఎక్సైజ్ అధికారులు వేసిన సీల్ చెదిరిపోకుండా సీసాపై మూతను తొలగిస్తున్నారు. సీసాలోంచి 100 నుంచి 150 మిల్లీలీటర్ల లిక్కర్ తీసి అంతే మొత్తంలో నీళ్లు పోస్తున్నారు. అనుమానం రాకుండా తిరిగి సీల్ వేసి విక్రయిస్తున్నారు. లేబులింగ్ విభాగంలో పనిచేసే ఎక్సైజ్ అధికారులు తప్ప సాధారణ విధులు నిర్వర్తించే ఎక్సైజ్ సిబ్బంది నకిలీ మద్యం సీసాను, దానిపై వేసిన సీల్ను గుర్తుపట్టలేరు. దీంతో ఈ దందా యథేచ్ఛగా సాగుతోంది. గతంలో ఇలాంటి మోసాలు మెట్రోపాలిటన్ సిటీలో ఉన్న మద్యం దుకాణాల్లో మాత్రమే జరిగేది.
వేసిన సీల్ చెడిపోకుండా సీసాపై మూతలు తొలగించగల నిపుణులు కూడా చాలా కొద్దిమంది మాత్రమే ఉండేవారు. ఇప్పుడు వీళ్లు రూ. 5000 తీసుకుని ఆసక్తిఉన్న నిరుద్యోగ యువకులకు తర్ఫీదునిస్తున్నారు. మద్యం దుకాణాలు కూడా నమ్మకస్తుడైన తమ వ్యక్తికి సీసా మూతలు తొలగించడంలో తర్ఫీదు ఇప్పిస్తున్నాయి. దీంతో మారుమూల మండలాల్లో కూడా మద్యంలో నీళ్లు కలిసి పలచనవుతోంది. వరంగల్ జిల్లా జనగామలోని సింధుసాయి వైన్స్లో మూతలు తొలగించి మద్యం కల్తీ చేస్తుండగా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంటు అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ప్రస్తుతం ఇలాంటి విధానమే రాష్టవ్య్రాప్తంగా అమలవుతోందని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంటు అధికారి ఒకరు చెప్పారు.
Sunday, February 6, 2011
దళితుల వివాదం విగ్రహం తో నిరసన

వివాదాలు.. దీక్షలు.. రాజకీయ పరిణామాల నడుమ ఎట్టకేలకు గుంటూరు నగరం నడిబొడ్డున బాబూ జగజ్జీవన్రామ్ విగ్రహం నెలకొల్పారు. నగరంలోని శ్రీవేంకటేశ్వర విజ్ఞానమందిరం కూడలిలో ఆదివారం జగ్జీవన్రామ్ కాంస్య విగ్రహాన్ని నేతలు ఆవిష్కరించారు. రాష్ట్ర గ్రామీణ ఉపాధిశాఖ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ లాడ్జిసెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద నుంచి దళిత నేతలతో కలసి ర్యాలీగా తరలివచ్చారు. శాసన మండలి డిప్యూటీ చైర్మన్ మహ్మద్జానీ, ఎంపీ రాయపాటి సాంబశివరావు విగ్రహాన్ని ఆవిష్కరించారు. పూలమాలలు వేసి నివాళులర్పించారు.
వివాదాలు సరికాదు..
విగ్రహావిష్కరణ అనంతరం విజ్ఞానమందిరం ఎదుట ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాణిక్యవరప్రసాద్ మాట్లాడుతూ నగరంలో విగ్రహం ఏర్పాటు దళితుల ఆత్మగౌరవానికి సంబంధించిన విషయమన్నారు. విగ్రహం ఏర్పాటు విషయంలో వివాదాలు మంచివి కావని హితవు పలికారు. కార్యక్రమ అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలోని సీనియర్ మంత్రితో తనకు ఎలాంటి విభేదాలు లేవని, విగ్రహం ఏర్పాటు అందరం కలిసి కట్టుగా చేసుకున్న కార్యక్రమమని తెలిపారు. సభలో మహ్మద్జానీ ప్రసంగిస్తూ అంబేద్కర్, జగ్జీవన్రామ్లు అణగారిన వర్గాల అభ్యున్నతికి పాటుపడ్డారని తెలిపారు. ఎంపీ రాయపాటి మాట్లాడుతూ బీహార్లో ఆయన తిరుగులేని నాయకుడుగా ఎదిగిన జగ్జీవన్రామ్ తదనంతరం ఆ రాష్ట్రంలో పార్టీ బాగా దెబ్బతిందన్నారు.
దళితులను ప్రేమించే నాయకులు కావాలి..
నరసరావుపేట ఎంపీ మోదుగుల వేణుగోపాలరెడ్డి మాట్లాడుతూ జిల్లాలో ఎక్కడ చూసినా ఎన్టీఆర్, వైఎస్ఆర్ విగ్రహాలు మినహా మరో నాయకుడి విగ్రహాలు ఏర్పాటు చేయడం లేదని, అటువంటి తరుణంలో జగ్జీవన్రామ్ విగ్రహం ఏర్పాటు చేయడం హర్షదాయకమన్నారు. దళితులను ప్రేమించే నాయకులు, అధికారులు రావాలని అభిలషించారు. జగ్జీవన్రామ్ అణగారిన వర్గాలకు మార్గద ర్శకంగా నిలిచారని సభాధ్యక్షుడు గుంటూరు తూర్పు నియోజకవర్గ శాసనసభ్యుడు మస్తాన్వలి కొనియూడారు. సభలో ఎమ్మెల్యేలు ప్రత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనంద్బాబు, ఎమ్మెల్సీలు రాయపాటి శ్రీనివాస్, కేఎస్ లక్ష్మణరావు, జెడ్పీ చైర్పర్సన్ కూచిపూడి విజయ, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ కూచిపూడి సాంబశివరావు, జేసీ శరత్, అదనపు జేసీ యాకూబ్నాయక్, స్థానిక నాయకులు, అధికారులు పాల్గొన్నారు. ఎస్పీ రవిచంద్ర ఆధ్వర్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటుచేశారు.
పుష్పను నిందించలేదు : కలెక్టర్
వేంకటేశ్వర విజ్ఞానమందిరం వద్ద జగజ్జీవన్రామ్ విగ్రహం ఏర్పాటు ప్రతిపాదన 2008లో వచ్చిందని కలెక్టర్ రామాంజనేయులు చెప్పారు. దీనిపైన విచారణ నిర్వహించి నివేదిక తయారు చేశామని చెప్పారు. నగరంలో అంబేద్కర్ భవన్ ఆధునికీకరణ, జగజ్జీవన్రామ్ విగ్రహం ఏర్పాటు విషయాలను తన దృష్టికి తీసుకురావడం జరిగిందన్నారు. అంబేద్కర్ భవనాన్ని రూ.25 లక్షలతో అభివృద్ధి పరిచేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు చెప్పారు. ఇందుకోసం స్పీకర్ మీరాకుమార్ స్థాపించిన సమతా మూవ్మెంట్ లెటర్ప్యాడ్మీద న్యాయవాది పుష్ప అధ్యక్షురాలిగా ఉన్నదానిపై ప్రతిపాదన పంపించడం జరిగిందన్నారు. విగ్రహాన్ని ఏర్పాటుకు అనుమతించే కమిటీ పుష్పపేరుమీద అనుమతించిందన్నారు. ఈ నేపధ్యంలో తానుసొంతంగా విగ్రహం ఏర్పాటు చేస్తానని పుష్ప చెప్పారని తెలిపారు. దళితనేతలు అందరూ మాట్లాడినా ఆమె కాదన్నారని చెప్పారు. దళిత సోదరులందరూ ఒకవైపుకు వెళ్లారన్నారు.
ఈ విషయాన్ని జిల్లా ఇన్చార్జిమంత్రి బొత్సా సత్యనారాయణదృష్టికి తీసుకువెళ్లిన తర్వాత ప్రతిష్టించాలని నిర్ణయించడం జరిగిందన్నారు. ఇప్పటికీ విగ్రహం శిలాఫలకంలో ఆమె పేరు ఉందని, తాను ఫోన్లో మాట్లాడిన విషయాలను ఆమె రికార్డు చేశారని చెబుతున్నారని, ఆ రికార్డుల్లో ఏముందో నాకేం అభ్యంతరం లేదన్నారు. తాను ఆమెను నిందించినట్లు ఎక్కడా లేదని కలెక్టర్ స్పష్టం చేశారు.
న్యాయపోరాటం చేస్తా: వైఎస్ పుష్ప
తాను తయూరు చేరుుంచిన విగ్ర హం ఆవిష్కరించాలని ప్రయత్నించి విఫలమైన న్యాయవాది వైఎస్ పుష్ప గాంధీ పార్కు వద్ద జగ్జీవన్రామ్ విగ్రహంతో పాటు దీక్ష చేస్తూ మధ్యాహ్నం సొమ్మసిల్లి పడిపోయారు. విగ్రహావిష్కరణ సభ పూర్తి అయిన తర్వాత ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఒక వైపు విగ్రహావిష్కరణ జరుగుతుండగా మరోవైపు తాను తయారు చేసిన విగ్రహం వద్ద కూర్చుని సెలైన్ పెట్టించుకుని మరీ నిరసన వ్యక్తంచేశారు. తనకు వచ్చిన ఆర్డర్ను కాదని, హైకోర్టులో కేసు పెండింగ్లో ఉండగా మంత్రి వరప్రసాద్, కలెక్టర్ వేరే విగ్రహాన్ని ఏర్పాటు చేశారని బోరున విలపించారు. దీనిపైన తాను న్యాయపోరాటం చేస్తానని చెప్పారు. ఈ విషయంలో మంత్రి కన్నాకు ఎటువంటి సంబంధం లేదన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తాను తయారు చేయించిన విగ్రహానికి నగరంలో తగిన స్థలాన్ని చూపించాలని కోరారు.
Friday, February 4, 2011
పెప్సీ కంపెనీలో ఆకస్మిక తనిఖీ
Wednesday, February 2, 2011
మద్యం స్మగ్లింగ్ సూత్రదారి ఈ విలేకరి
కాసులకు కక్కుర్తి పడి ఎడా పేడ గుర్తింపు కార్డ్లు జారి చేసిన పోరా సంబంధాల్ శాక అధికారులు తలలు పట్టుకొంతున్నారు.నకిలీ విలేకరుల ఆగడాలు గతంలో ఎక్కువగా వెలుగుచూస్తుండేవి... ప్రస్తుతం ప్రభుత్వం నుంచి గుర్తింపు పొందిన అక్రిడేటెడ్ జర్నలిస్టులే నేరుగా రంగంలోకి దిగి ఆ ముసుగులో అరాచకాలు, అక్రమాలకు పాల్పడుతున్నారు. ఏకంగా ఎస్పీ కార్యాలయాన్నే అడ్డాగా చేసుకొని అమాయకులను మోసగిస్తున్న సంఘటనలు మరువక ముందే మరొకటి వెలుగులోకి వచ్చింది. విదేశీ మద్యం స్మగ్లింగ్ కేసులో మంగళవారం ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పట్టుకున్న ఇద్దరిలో ఒకరు ప్రభుత్వ గుర్తింపు పొందిన విలేకరి అని తెలుసుకొని కంగు తిన్నారు
. ఈ విషయం ఎక్సైజ్ అధికారులకు మంగళవారం రాత్రే తెలిసినా మీడియా దృష్టికి తీసుకురాలేదు. పట్టుబడిన ఇద్దరిలో ఒకరైన భద్రశర్మ తాను జర్నలిస్టునని , తన వద్ద ఉన్న గుర్తింపు కార్డును చూపి ఎక్సైజ్ అధికారులను బెదిరించేందుకు ప్రయత్నించాడు. అతని వద్ద నుంచి ఆ గుర్తింపు కార్డును స్వాధీనం చేసుకున్న ఎక్సైజ్ అధికారులు బుధవారం దానిపై దర్యాప్తు నిర్వహించి అతను విలేకరేనని నిర్ధారణ కావడంతో ఆశ్చర్యపోయారు. అరండల్పేటలో విదేశీ వస్తువులను విక్రయించే దుకాణం నిర్వహించే భద్రశర్మ గత కొన్నేళ్లుగా అక్రమంగా విదేశీ మద్యం అమ్మకాలుకూడా సాగిస్తున్నాడు. తన అక్రమ వ్యాపారం సజావుగా సాగేందుకు విలేకరి ముసుగు దోహదపడుతుందని భావించాడు.
ఏపీఈఎంఎస్ అనే న్యూస్ ఏజన్సీకి పిడుగురాళ్ల విలేకరిగా పనిచేస్తున్నట్లు గుర్తింపు కార్డు పొందాడు. సమాచార పౌర సంబంధ శాఖ కూడా 2010కి అక్రిడేషన్ కార్డును మంజూరుచేసింది. విదేశీ మద్యాన్ని భధ్రశర్మ చెన్నై నుంచి ఇక్కడకు తీసుకువచ్చి తెలిసిన వ్యక్తుల ద్వారా విక్రయిస్తుంటాడు. ఒక్కో విదేశీ మద్యం సీసా ఖరీదు రూ. 2 వేల నుంచి 20 వేల వరకు ఉంటుంది. మంగళవారం పట్టుబడిన మద్యం సీసాల్లో ఏడు, ఎనిమిది వేలు ఖరీదు చేసేవి ఉన్నాయి. ఇటీవల కాలంలో విదేశీ మద్యానికి అలవాటుపడినవారు గుంటూరు
నగరంలో ఎక్కువ కావడంతో వీరి వ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయలుగా సాగుతున్నది. ఒక్కో బాటిల్ ద్వారా రూ. వెయ్యి వరకు ఆదాయం లభించే అవకాశం ఉంది. చెన్నై నుంచి తెనాలి వరకు రైలు మార్గం ద్వారా తీసుకువచ్చి అక్కడినుంచి కారులో గుంటూరుకు చేరుస్తారు. ఒక్కోసారి ట్రావెల్ ఏజన్సీల ద్వారా కూడా వీటిని తీసుకువస్తారు. ఎన్ఫోర్స్మెంట్ సిీఐ తిరుపతయ్య తాను బ్యాంకు అధికారినని నమ్మించి విలేకరి భధ్రశర్మను, మరో వ్యక్తిని వలపన్ని పట్టుకున్నారు. నాన్ బెయిలబుల్ కేసులో పట్టుబడిన విలేకరి భద్రశర్మను కోర్టుకు హాజరుపరచగా ఈనెల 15 వరకు రిమాండ్ విధించారు.
అక్రిడేషన్ రద్దుచేస్తాం- డీపీఆర్వో
విదేశీ మద్యం కేసులో పట్టుబడిన భద్రశర్మ గుర్తింపుకార్డును రద్దుచేస్తున్నట్లు జిల్లా పౌర సంబంధాల శాఖ అధికారి పి నరసింహారావు తెలిపారు. ఈ సంఘటనపై ఆయన స్పందిస్తూ బుధవారం '' ప్రతినిధితో మాట్లాడుతూ ఆ కార్డు 2010 డిసెంబరు 31 నాటికి ముగిసినా మరో మూడు నెలలు పొడిగించినట్లు చెప్పారు. అయితే భద్రశర్మ గుర్తింపును రద్దుచేసి ఆర్టీసీ అధికారులకు కూడా సమాచారం అందించనున్నట్లు చెప్పారు.
Tuesday, February 1, 2011
కే.చీ.ఆర్. కు సీమాంధ్ర నాయకుల పార్శిల్

సీమాంధ్ర బిర్యాని పేడ అని అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి నేతలు గుంటూరులో విన్నూత్న రీతి లో నిరసన తెలిపారు.
బిర్యాని ఒకసారి తింటే దాని రుచి కేసిీఆర్కి తెలుస్తుందని సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి నేతలు అన్నారు. సీమాంధ్ర బిర్యానీపై కేసిీఆర్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా మంగళవారం గుంటూరులో సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి నాయకులు రుచికరమైన మటన్ దమ్ బిర్యాని తయారు చేసి కేసీఆర్కు పార్శిల్ పంపారు. అనంతరం సమైక్యాంధ్ర నేతలకు, మీడియా ప్రతినిధులకు బిర్యాని రుచి చూపించారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు ఎండి హిదాయత్ మాట్లాడుతూ కేసఈఆర్ వాడుతున్న పదజాలం సీమాంధ్రుల మనోభావాలను దెబ్బతీస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా సీమాంధ్ర మైనార్టీల సంస్కృతి, సంప్రదాయాలు, గౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఆయన మాట్లాడుతున్నారన్నారు. తక్షణం కేసి ఆర్ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. పీఆర్పీ నాయకులు క్రోసూరి వెంకట్ మాట్లాడుతూ పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్న కేసిీఆర్కు అది ముదిరి బట్టలు లేకుండా రోడ్డు మీద పడే పరిస్థితి రాకుండా తక్షణం యర్రగడ్డ పిచ్చి ఆసుపత్రిలో చేర్చాలని సూచించారు. టీడీపీ నాయకులు కసుకుర్తి హనుమంతరావు మాట్లాడుతూ అన్నం మెతుకులు కిందపడితే కళ్లకు అద్దుకొని తింటామని, కేసిీఆర్ దాగుడు మూతలు ఆపాలని కోరారు.
డీసీసీ ఎస్సీసెల్ అధ్యక్షుడు యరమాల విజయ్ కిరణ్ మాట్లాడుతూ కేసీఆర్ పిచ్చి ప్రేలాపనలు మానుకోవాలన్నారు. సీమాంధ్రుల ఓర్పు, సహనం, శాంతిని పరీక్షించవద్దన్నారు. కేసిీఆర్ది రాజకీయ డ్రామ అని, పదవుల కోసమే నాటకం ఆడుతున్నారన్నారు. ఈ సందర్భంగా జెట్టి ఝాన్సీ రాణి ఆలపించిన 'రగిలింది తెలుగు తేజం, కదిలింది సమైక్య వాదం' అనే గీతం అందర్ని ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో ఫిరంగిపురం మార్కెట్ యార్డు వైస్ ఛైర్మన్ అబ్దుల్ బాసిద్, ఎండి ఇంతియాజ్, కనపర్తి శ్రీనివాసరావు, పి రీయాజ్ ఖాన్, బొట్ల బ్రహ్మం, ఎండి సర్దార్ బాషా తదితరులు పాల్గొన్నారు.
మార్కెట్ సెంటర్లో దొంగతనం
ఈ దాడిలో అబ్దుల్ కలాం అనే వ్యాపారికి తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బాధితులు, పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. చిలకలూరిపేటలోని గుర్రాలచావిడి ప్రాంతానికి చెందిన మౌలాలి, అద్దంకికి చెందిన అబ్దుల్ కలాంలు పాత ఇనుము వ్యాపారం చేస్తుంటారు. పాత ఇనుము కొనుగోలు చేసి మార్టూరులోని ప్యాక్టరీకి తరలిస్తుంటారు. అయితే విద్యానగర్లోని వ్యాపారి వద్ద మంగళవారం రాత్రి మౌలాలి రూ. 3.50 లక్షలు, అబ్దుల్ కలాం రూ. 3 లక్షలు తీసుకొని రెండు వేర్వేరు బ్యాగుల్లో ఆటోలో బయల్దేరారు. మార్కెట్ సెంటర్లో దిగి బస్సు కోసం వేచి ఉన్నారు. అయితే దోపిడీ దొంగ ఒక్కసారిగా వారి కళ్లల్లో కారం కొట్టి కర్రతో దాడి చేశాడు. ఇది గమనించిన స్థానికులు పాత కక్షల నేపథ్యంలో దాడి జరుగుతుందని భావించారు.
ఈ దాడిలో అబ్దుల్ కలాం తలకు రెండు చోట్ల బలమైన గాయాలై పడిపోయాడు. అయినప్పటికీ బ్యాగ్ను గట్టిగా పట్టుకున్నాడు. దీంతో దొంగ బలవంతంగా ఇరువురి వద్ద ఉన్న బ్యాగ్లను గుంజుకొని పరారయ్యాడు. దీంతో వ్యాపారులు దొంగ, దొంగ అని కేకలు వేయటంతో అప్రమత్తమైన స్థానికులు వెంటపడి దొంగను పట్టుకొని దేహశుద్ధి చేశారు. విషయం తెలుసుకున్న సీసీఎస్ డీఎస్పీ నంజుండప్ప, కొత్తపేట రక్షక్ వాహనం, లాలాపేట బ్లూ కోల్ట్స్ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. గాయపడిన కలాంను 108లో జీజీహెచ్కు తరలించారు. కాగా ఘటనా స్థలంలో అపస్మారక స్థితిలో ఉన్నట్లు నటిస్తూ దొంగ పడిపోయాడు. దీంతో స్థానికులు ఆటోలో ఎక్కించారు. పోలీస్ స్టేషన్ వద్దకు వెళ్లిన తరువాత దొంగ ఒక్కసారిగా కానిస్టేబుల్ అంబేద్కర్ (పీసీ 645), రక్షక్ ్రడైవర్ అన్వర్ బాషాలను కట్టేసి దొంగ మళ్ళీ పరారయ్యాడు.
దీంతో వారు పట్నంబజారు బంగారపు కొట్ల వరకు పరిగెత్తి దొంగను పట్టుకొని స్టేషన్కు తరలించారు. సమాచారం అందుకున్న ఈస్ట్, వెస్ట్ డీఎస్పీలు టీవీ నాగరాజు, డి కోటేశ్వరరావు, సీఐ మధుసూదనరావు తదితరులు స్టేషన్కు చేరుకొని పట్టుబడిన దొంగను విచారిస్తున్నారు. తెనాలికి చెందిన రఫీగా గుర్తించినట్లు సమాచారం. గతంలో అతనిపై ఉన్న కేసులు ఇంకా ఏమైనా వెలుగు చూడని నేరాలకు పాల్పడ్డాడా అనేదానిపై పోలీసులు విచారణ సాగిస్తున్నారు. గత పది రోజుల క్రితం కూడా మార్కెట్ సెంటర్లో కారులో వెళుతున్న వ్యాపారుల సూట్కేస్ను కూడా ఇదే విధంగా గుంజుకొని పరిగెత్తుతుండగా స్థానికులు వెంటపడి పట్టుకొని దొంగను దేహశుద్ధి చేసినట్లు విచారణలో వెల్లడైంది. అయితే అప్పుడు వ్యాపారులు పోలీసులకు ఫిర్యాదు చేయకపోవటం గమనార్హం.
స్థానికుల స్పందనకు ప్రశంసలు
దోపిడీ చేసి పారిపోతున్న దొంగను వెంటాడి పట్టుకున్న స్థానికులు ప్రశంసలు అందుకున్నారు. ఏ మాత్రం భయపడకుండా వారు దొంగను పట్టుకొని అప్పగించటం పట్ల పోలీసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులకు ఇదే విధంగా స్థానికులు తమ వంతుగా సహకరిస్తే నేరాలను అరికట్టటం సులువు అవుతుందని వారు అంటున్నారు. అదేవిధంగా పారిపోతున్న దొంగను వెంటాడి పట్టుకున్న కానిస్టేబుల్ అంబేద్కర్, ్రడైవర్ అన్వర్ బాషాతో పాటు బ్లూకోల్ట్స్ కానిస్టేబుళ్లు సురేష్ (పీసీ 2823), సుభాని (పీసీ 2589)లను అదేవిధంగా సహకరించిన స్థానిక యువకుడు వినోద్కుమార్లను పోలీసు అధికారులు అభినందించారు.