Total Pageviews

Sunday, May 8, 2011

ప్రేమ త్రికోణం

స్నేహితురాలికి ఇష్టం లేని పెళ్లి చేశా రు.. దీనిని తట్టుకోలేని నవ వధువు, ఇద్దరు స్నేహితులు ఆత్మహత్యకు య త్నించిన ఘటన శనివారం తక్కెళ్ళపాడు సమీపంలో జరి గింది. భీమవరానికి చెందిన డి లావ ణ్య, తెనాలికి చెందిన ఎం సుజన గుం టూరులోని సిమ్స్ కాలేజీలో బీపీటీ కోర్సు చదువుతున్నారు. ఒకరు నాలు గో సంవత్సరం కాగా, మరొకరు ఐదో సంవత్సరం కోర్సు చేస్తున్నారు.

తాపీ మేస్త్రిగా పని చేసే తాడేపల్లికి చెందిన ఇస్కేపల్లి దిలీప్ అనే యువకుడు సుజనకు పిన్ని కొడుకు అవుతాడు. లావణ్య, సుజనలు సిమ్స్ కాలేజీలో ఒకే గదిలో ఉంటూ చదువుకుంటు న్నారు. దిలీప్ వారికి కావాల్సిన వస్తువులను తీసుకొచ్చి ఇస్తుంటాడు. ఈ క్రమంలో ముగ్గురి మధ్య స్నేహం ఏర్పడింది. ఈ స్నేహం ప్రేమగా మారి ముగ్గురి మధ్య శారీరిక సంబంధం ఏర్పడినిది.

ఈ నేపథ్యంలో ఈ నెల 5న సుజనకు వివాహం జరిగింది. అయితే సుజనకు ఇష్టంలేని పెళ్లి జరిగిందని ముగ్గురూ ఆత్మహత్య చేసుకోవాలని తక్కెళ్ళపాడు సమీపంలోని గుంటూరు చానల్ వద్ద ఉన్న మొక్కజొన్న పొలానికి ద్విచక్ర వాహనంపై శనివారం వచ్చారు. అక్కడి గడ్డిమందు తాగారు. వీరిని గమనించిన కూలీల సమాచారంతో 108 సి బ్బంది ముగ్గురిని గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. లావణ్య, సుజనల పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్య చికిత్స కోసం ్రపైవేటు ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఎన్నో అనుమానాలు... లావణ్య, సుజన, దిలీప్‌ల ఆత్మహత్యాయత్నంపై అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ఇష్టంలేని వివాహం జరిగితే సుజన ఒక్కతే ఆత్మహత్య చేసుకోవాలి కాని మిగిలిన ఇద్దరు ఎందు కు ఆత్మహత్యకు యత్నించారనేది ఎవరి కీ అర్థం కావడం లేదు. శుక్రవారం లగేజీతో ఇంటి నుంచి బయటకు వచ్చిన లావణ్య శనివారం మధ్యాహ్నం వర కు ఎక్కడ ఉన్నాదో తెలియాల్సి ఉంది. పొలంలో ద్విచక్ర వాహనంపై వచ్చిన ముగ్గురి మధ్య స్వల్ప వాగ్వివాదం జరిగినట్లు సమాచారం. వారి మధ్య ఘర్షణ కారణాలేంటో పోలీసు దర్యాప్తులో తేలాల్సి ఉంది.

మీడియాపై ఆగ్రహం ఆత్మహత్యకు యత్నించిన ముగ్గురి ఉదంతం తెలిసి జీజీహెచ్‌కు వెళ్లిన మీ డియాపై ప్రతిని««ధులపై వైద్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీపీటీ విద్యార్థినుల ఆత్మహత్యాయత్యం విషయా న్ని గోప్యంగా ఉంచాలని వైద్యులు ప్రయత్నించారు. ఫొటోలు, వీడియో తీస్తుం డగా వైద్యులు అడ్డుకున్నారు. దీంతో మీడియా, వైద్యుల మధ్య వాగ్వివాదం జరిగింది.

స్థానిక పోలీసులు కూడా తమకు పట్టీపట్టనట్టుగా వ్యవహరించారు. ఎంఎల్‌సి కేసు నమోదు చేయకుండానే క్షతగాత్రులను ఆసుపత్రి నుంచి పంపించివేశారు. ఈ విషయంపై మీడియా ప్రతినిధులు సూపరింటెండెంట్ ఫణిభూషణ్‌కు ఫిర్యాదు చేశారు. విచారిస్తామని సూపరింటెండెంట్ హామీ ఇచ్చారు.

No comments:

Post a Comment