Total Pageviews

Saturday, December 21, 2013

మహిళ గడప దాటని కాలం. పాక్షికంగా సహగమనం పాటిస్తున్న రోజులు. అలాంటి సందర్భంలో ఒక మహిళ ధిక్కారస్వరం మహిళా లోకానికి మేలుకొలుపు వంటిదే. ఆమె పురుషాధిక్య సమాజం మీద ఎగసిపడిన తిరుగుబాటు కేతనం. ఆమె ‘నాయకురాలు నాగమ్మ’,  పల్నాటి వీరవనిత నాగమ్మ. పల్నాడు మోమున విరిసిన పొద్దుతిరుగుడు పువ్వు. ఒక్క పలనాటి చరిత్రలోనే కాకుండా, దేశ చరిత్రలోనే విశిష్టమైన మహిళా మణి.

 నాగమ్మ చరిత్రలో కనిపించే తొలి దేశీయ మహిళా మంత్రి. 12వ శతాబ్దంలో పల్నాడు రాజ్యానికి మహామంత్రి ఆమె. సుపరిపాలన అందించినట్టు ఖ్యాతి గన్న వనిత. ప్రజానేత. ఆమెతోనే మహిళల రాజకీయ ప్రస్థానం ప్రారంభమైనట్టు చరిత్ర చెబుతోంది. ఆమెను కొన్ని సృజనాత్మక రచనలలో ప్రతినాయకురాలుగా కవులూ నాటకకర్తలూ చిత్రించి ఉండవచ్చు. కానీ చరిత్రలో ఆమె ఆధిక్యానికి గొప్ప నిరద్శనం ఆమెకు మాత్రమే పరిమితమైన ‘నాయకురాలు’ బిరుదు. రాణీ రుద్రమ్మ, ఝాన్సీలక్ష్మీ బాయిల కంటె ముందే పాలన చేపట్టింది. ప్రజారంజకమైన పాలనతో చరిత్రకారుల ప్రశంసలు అందుకున్న దక్షురాలు నాగమ్మ. అత్యంత ఆదర్శనీయమైన విదేశ సంబంధాలకు ఉన్నతమైన మార్గాలను అన్వేషించిన మైత్రీ పరిమళం ఆమె. తమ మధ్య ఉన్న విభేదాలను విస్మరించి పల్నాటి యుద్ధంలో ఆమెకు పొరుగు రాజ్యాల వారు సాయం అందించడం విశేషం. ఇది ఆమె రాజకీయ చతురతకు నిదర్శనం. ఆమె ఖడ్గధారి అయిన యోద్ధ.  ఒక అపురూప విదుషీమణి. ఆ రోజుల్లోనే సంస్కృతం, కన్నడ, తమిళ, మలయాళ భాషలను అభ్యసించింది. సంగీతం కూడా నేర్చుకుంది.
 బ్రహ్మనాయుడికి దీటుగా నిలబడి తన శక్తి సామర్థ్యాలను నిరూపించుకున్న యుక్తురాలైన రాజకీయవేత్త నాగమ్మ. బ్రహ్మనాయుడి వ్యూహాలను ఛేదిస్తూ తన ప్రభువు నలగామరాజునూ, రాజ్యాన్నీ కాపాడింది ఆమె. రాజ్యం ముక్కలు కాకుండా అడ్డుకుంది. పల్నాటి చరిత్ర తొలి వీరగాథ. అందులో కీలక పాత్ర నాగమ్మదే. పల్నాడులో ఒకవైపు నాగమ్మ, మరోవైపు బ్రహ్మనాయుడు నాయకులుగా ఉండి జరిపించిన యుద్ధం పల్నాటియుద్ధం. గుంటూరు జిల్లాలోని రణస్థలి కారంపూడి.

 ఈ ఘట్టాన్ని ఇప్పటికీ ఈ ప్రాంత ప్రజలు విస్మరించలేదు. తెలుగు ప్రాంతంలో అనేక యుద్ధాలు జరిగాయి. కానీ అందులో పల్నాటి యుద్ధంలో వలె ఇప్పటికీ స్మరించుకుంటున్న యుద్ధాలు కనిపించవు. కార్తీక అమావాస్య రోజున ప్రారంభమైనయుద్ధం ఐదు రోజులు జరిగింది. ఆ యుద్ధంలో మరణించిన బ్రహ్మనాయుడి వర్గం వారి ఆయుధాలను కారంపూడిలో ఇప్పటికీ ఏటా పూజిస్తారు. ఈ ఉత్సవం పేరు ‘కొణతముల’. అక్కడ నుంచి సరిగ్గా ఐదు తెలుగు తిథుల తరువాత వచ్చే మార్గశిర ఏకాదశి నుంచి బహుళ పాడ్యమి వరకు నాగమ్మ, ఆమె పక్షాన పోరాడిన వారి స్మృత్యర్థం గురజాలలో ఉత్సవాలు జరుగుతాయి. పౌర్ణమికి జరిగే సిడిమాను ఊరేగింపు ఇందులో ముఖ్యమైనది. కారెంపూడిలో వీర విద్యావంతులు పల్నాటి వీర చరిత్రను గానం చేస్తారు. గురజాలలో పిచ్చిగుంటల వారు ఆ కథలు చెబుతారు. అక్కడా ఇక్కడా ఐదురోజులు ఈ కథాగానం జరుగుతుంది. కానీ ఇటీవల పిచ్చిగుంటల వారి కథాగానం నిలిచిపోయింది.

Sunday, October 28, 2012

National level eligibility test

 ఎంతకీ మింగుడుపడని 'నీట్'ను అడ్డుకోవడానికి ప్రభుత్వం ఓ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించింది. తనంతట తానుగా పక్కనపట్టేయడంతో చిలుము పట్టిన కత్తికి... ఇప్పుడు పదును పెట్టి మరీ ప్రయోగించింది. ఆ అస్త్రం పేరు... ఆర్టికల్ 371 (డి). నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) నుంచి తప్పించుకోవడానికి ఈ ఆర్టికల్‌ను తురుఫు ముక్కగా వాడారు. ఈ అధికరణ ప్రకారం... రాష్ట్రంలోని మెడికల్, డెంటల్ కళాశాలలకు సంబంధించి నీట్‌ను అమలు చేయాల్సిన అవసరం లేదంటూ సరికొత్త వాదనను తెరపైకి తెచ్చారు. 

ఇంతకూ 371 (డి) అంటే ఏమిటి? ఇది ఎలా వచ్చింది? దీనికీ, ఆంధ్రప్రదేశ్‌కూ సంబంధమేమిటి? అనే కోణంలో చూస్తే ఎన్నెన్నో ఆసక్తికర అంశాలు వెలుగుచూశాయి. పాకిస్థాన్, భారత్ మధ్య జమ్మూ కాశ్మీర్ వివాదం ఏర్పడినప్పుడు కాశ్మీర్‌కు పాక్షిక స్వయంప్రతిపత్తి కల్పిస్తూ రాజ్యాంగంలోని ఆర్టికల్ 370తో ప్రత్యేక అధికరణను చేర్చారు. దీని ప్రకారం... భారత పార్లమెంటు చేసే చట్టాలు జమ్మూ కాశ్మీర్‌కు వాటంతటవిగా వర్తించవు. అక్కడి శాసనసభ కూడా ఈ చట్టాలను ఆమోదించాల్సి ఉంటుంది. ఇది కాశ్మీర్ సంగతి. ఇక, మన విషయానికి వస్తే...
1969లో తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగిన నేపథ్యంలో తెలంగాణ ప్రాంత హక్కుల పరిరక్షణ కోసం ముల్కీ రూల్స్ అమల్లో వచ్చాయి. 

1972లో జై ఆంధ్ర ఉద్యమం తర్వాత కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించడం, కోర్టు ముల్కీ రూల్స్‌ను కొట్టివేయడం జరిగింది. ఆ తర్వాతి క్రమంలో రాష్ట్రంలోని మూడు ప్రాంతాల ప్రజల హక్కుల పరిరక్షణకు పెద్ద మనుషుల ఒప్పందం రూపొందించారు. ఈ మేరకు 1973 సెప్టెంబర్ 21న ఆరు సూత్రాల పథకం అమల్లోకి వచ్చింది. ఇలాంటి ఒప్పందాలన్నీ గతంలో అనేకం వచ్చినా వాటికి సరైన చట్టబద్ధత లేకపోవడంతో రాజ్యాంగపరంగా కొన్ని రక్షణలు కల్పించాలనే ఉద్దేశంతో... ఆంధ్రప్రదేశ్‌లో విద్యా, ఉద్యోగ అవకాశాల్లో స్థానికుల హక్కుల పరిరక్షణ కోసం రాజ్యాంగం ఆర్టికల్ 371(డి)ను చేర్చారు. 

అన్ని విద్యా సంస్థలను రాష్ట్ర స్థాయి విద్యా సంస్థలుగా, స్థానిక విద్యా సంస్థలుగా ప్రభుత్వ ఉద్యోగాలను, రాష్ట్ర, జోనల్, జిల్లాలుగా వర్గీకరిస్తూ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ తయారుచేశారు. ఆర్టికల్ 371 (డి)లో పేర్కొన్న అంశాలకు అనుబంధంగా ఇది రూపొందింది. ఈ ఉత్తర్వులను ఉల్లంఘించడమంటే... రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమే. రాష్ట్రపతి ఉత్తర్వుల పకడ్బందీ అమలుకోసం 610 జీవో కూడా జారీ అయ్యింది. 

స్థానికులకే రిజర్వేషన్లు...
ఆర్టికల్ 371 (డి) ప్రకారం విద్యా సంస్థలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థానికులకు రిజర్వేషన్లు ఉంటాయి. విద్యాసంస్థల విషయానికొస్తే... 85 శాతం సీట్లు స్థానికులకు రిజర్వు చేయాలి. 15 శాతం ఓపెన్ కేటగిరీకి ఇవ్వాలి. ఆ విద్యాసంస్థ రాష్ట్రస్థాయిదైతే రాష్ట్ర విద్యార్థులకు 85 శాతం సీట్లు ఇవ్వాలి. ప్రాంతీయ స్థాయిదైతే ఆ ప్రాంతం వారికి 85 శాతం సీట్లు రిజర్వు చేసి మిగతా 15 శాతం ఓపెన్ కేటగిరీలో ఇచ్చుకోవచ్చు. ఇందుకుగాను మూడు ప్రాంతాల మధ్య సీట్ల విభజన కూడా జరిగింది. తెలంగాణకు 42 శాతం, కోస్తాంధ్రకు 36 శాతం, రాయలసీమకు 22 శాతం సీట్లను రాష్ట్ర స్థాయి విద్యాసంస్థల్లో కేటాయించాల్సి ఉంటుంది. 

నీట్ అమలులోకి వస్తే... రాష్ట్రంలోని మెడికల్ కళాశాలల్లో 85 శాతం సీట్లు స్థానికులకు కేటాయించాలన్న నిబంధనను ఉల్లంఘించినట్లే. నీట్‌ను అడ్డుకునేందుకు ప్రభుత్వం కూడా ఇదే నిబంధనను ఉపయోగించుకుంది. అయితే... 371 (డి) రాజ్యాంగం కల్పించిన సమాన హక్కులకు విరుద్ధమని, ఏ రాష్ట్రానికీ లేని విధంగా ఆంధ్రప్రదేశ్‌లో స్థానికులకు రిజర్వేషన్లు కల్పించడం న్యాయ సమ్మతంకాదని పలు పిటిషన్లు దాఖలయ్యాయి. 

అయితే... సుప్రీంకోర్టు ఈ పిటిషన్లను తిరస్కరించింది. కొన్ని కేసుల్లో డివిజన్ బెంచ్ అప్పీలుకెళ్తామన్న అభ్యర్థనను కూడా అంగీకరించలేదు. సుదీర్ఘ ఉద్యమాలు, ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో కొన్ని ప్రాంతాల హక్కుల పరిరక్షణ కోసం రూపొందిన ఈ రాజ్యాంగ నిబంధనను కొట్టివేయలేమని తేల్చిచెప్పింది. 371 (డి)కి అంత శక్తి ఉంది. 

కానీ...
ప్రభుత్వమే తూట్లు పొడిచింది..

ఆర్టికల్ 371 (డి) కింద విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లే కాదు... మరిన్ని ప్రత్యేక సదుపాయాలు ఆంధ్రప్రదేశ్‌కు దక్కాయి. ఈ నిబంధనలకు అనుగుణంగానే హైదరాబాద్‌లో సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పడింది. ఉద్యోగుల సర్వీసు, పదోన్నతులు తదితర అంశాలను విచారించేందుకు రాజ్యాంగబద్ధంగా ఆంధ్రప్రదేశ్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ఏర్పాటయింది. దీనికి విశేషాధికారాలు కల్పించారు. ట్రిబ్యునల్ ఉత్తర్వులను ప్రభుత్వం సీరియస్‌గా పరిగణించాలని, ఈ తీర్పులను హైకోర్టులో సవాల్ చేయడానికి వీల్లేదని రాజ్యాంగం స్పష్టంగా పేర్కొంది. 

అయితే... 1989లో అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్‌నే రద్దు చేశారు. దేశవ్యాప్తంగా ఇతర రాష్ట్రాల్లో కూడా అలాంటి ట్రిబ్యునళ్ల ఏర్పాటుకు కేంద్రం ఓ చట్టం చేసింది. రాజ్యాంగబద్ధంగా ఏర్పాటైన, సర్వాధికారాలు ఉన్న రాష్ట్ర అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్‌ను రద్దు చేసింది. 1959 నవంబర్ 1 నుంచి కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు చేశారు. దీంతో ఈ ట్రిబ్యునల్‌కున్న విశేషాధికారాలు పోయాయి. ట్రిబ్యునల్ తీర్పులను ప్రభుత్వం పట్టించుకోవడం మానేసింది. ట్రిబ్యునల్ ఆదేశాలపై హైకోర్టులో కేసులు దాఖలు అవుతున్నాయి. అంటే... ట్రిబ్యునల్ పూర్వ వైభవాన్ని కోల్పోయి సాధారణ కోర్టుల స్థాయికి వచ్చింది.

Thursday, October 25, 2012

oka sukravaram saayanthram ఎడతెరిపి లేకుండా  వర్షం కురుస్తుంది.అపుడే పని ముగుంచుకోని ఆఫీస్ నుండి బయటకి వొచ్చిన నాకు కనుచూపు మీరకు రోడ్లలని జలమయం  కనిపిస్తున్నాయి.ఇంతలో నా సెల్ ఫోన్ మోగింది .అప్పటికే  పది సార్లు ఫోన్  చేసిన నా భార్య పదకొండసారి ఫోన్ చేససింది. కొంచం కొపం కొంచం నిస్థురం కలిపి "పిల్లాడి  మొదటి పుట్టిన రోజు కు కూడా రా ర ?"  అడిగిందింది .దానికి సమాధానంగా "వొస్తున్ననే బయలుదేరా , తెల్లవారేసరికి అక్కడ వుంటా " అని సమాధానం చెప్పా .రోడ్లు చూస్తీ భారీగా నీళ్ళు .ఓ పక్క భారీగా కురుస్తున్న వర్షం .ఆఫీస్ నుంచి బస్స్టాండ్ కి  వెళ్ళే లోపే  కచ్చితంగా తడిసిపోతా.పోనీ ట్రైన్ కి వెల్లడమ అంటె మనకి రైళ్ళ గురించి పెద్దగ తెలియదు .  రైలుకి వేల్ల్డమని నిర్ణయం తీసుకొన్నా.

ఆ వానలో తడుస్తూ బస్సు కోసం  ఎదురు చూస్తూన్న. తడిసిన  బట్టలతో నీళ్ళు  కారుతున్న  బూట్లతో బస్సు కోసం ఎదురుచూసా. చెన్నై  మహానగరం లో ఉన్న   సగం జనభా ఈ బస్సు లోనే ఉన్నారా !!!!! అనే అంతః  గా కిక్కిరిసి బస్సు వొచ్చింది .బస్సు లో టికెట్ తీసుకోవడానికి నేను   పడిన  పాట్లు నాకు దేవుడికే తెలుసు . 

Monday, June 18, 2012

kasi temple facts

హిందు టెంపుల్స్ - వ్హత్ హప్పెండ్ తొ థెం. అన్న పుస్తకాని ఎమధ్యనె చదివాను.1990 లొ విడుదల అయ్యిన రెందు సంపుతల ఈ పుస్తకం  సీతారం గొయల్, అరున్ సౌరి, హర్ష నారయణ్ లాంతి ప్రముకులు సంకలనం చెయ్యతం ఒక విశెషం.ఈ పుస్తకం లొ 2000 మసిదులు హిందు దేవాలయలని కూల్చి కట్టిన విషయలను ఆధారలతొ సహా వెల్లడించారు.ఆయితె వారు  వెల్లడించిన విషయాలు సమగ్రం కాదని, ఇంకొ 10000కు పైన ధ్వసం చెయ్యబడిన అలయాల వివరాలు త్వరొలొ వెల్లడిస్థామని తెలిపారు.ఆ పుస్తకం లొని వివరాలు ప్రకారం అసలైన కాసి విస్వనాధుని ఆలయం గుప్తుల కాలంలొ క్రీ.శ. 490లొ నిర్మించారు. దాన్ని మొహ్మదీయులు ధ్వంసం చెసి పెద్ద మసిద్ నిర్మించారు.1777 లొ ఇప్పుడు ఉన్న దెవాలయన్ని ఆహల్య భై హూల్కర్ నిర్మించారు.మహరాజ రంజిత్ సింఘ్ 1839 లొ గూపురానికి స్వర్ణ తాపడం చెయ్యించారు. ఈనాటికి కాశి విశ్వనధుని ఆలయం వెనుక ఘ్ననవాసి మసిద్ కనిపిస్తుంది.


అలాగె మన రాజమండ్రి పెద్ద మస్సీదు లొ కూడా కొన్ని స్థంబాల పైన దసావతారాలు చెక్కి ఉన్నయిట!!!! నిజం దెవుడికే తెలియాలి.      

Tuesday, May 29, 2012

50 Rs- 18 Years- Landmark judgement

"అవినీతిపరులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించొద్దు. తక్కువలో తక్కువగా రూ.50 లంచం తీసుకున్నా సరే వదిలిపెట్టొద్దు'' అని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది. అవినీతిపరులకు అవినీతి నిరోధక చట్టంలో పేర్కొన్న ఆరు నెలల కనీస శిక్షను తగ్గించడం సుప్రీం కోర్టు అయినా సరే సరికాదని వ్యాఖ్యానించింది. రూ.50 లంచం తీసుకున్నందుకు ఇద్దరు గుజరాతీ అధికారులను ప్రత్యేక కోర్టు దోషిగా నిర్థారించింది. ఆరు నెలల జైలుశిక్ష విధించింది. గుజరాత్ హైకోర్టులో సవాల్ చేసినా అక్కడ కూడా అదే శిక్షను ఖరారు చేసింది. దీంతో వారు సుప్రీం కోర్టును ఆశ్రయించారు.

ఈ ఘటన జరిగి 18 ఏళ్లు అయ్యిందని, తాము ఉద్యోగాలు కూడా కోల్పోయామని, తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, శిక్షను తగ్గించాలని విజ్ఞప్తి చేశారు. దీంతో, "లంచం తీసుకున్న మొత్తం చిన్నదే కావచ్చు. ఇటువంటి ధోరణులను నిరోధించేందుకే చట్టం కనీస శిక్షను విధించింది. ఏ స్థాయిలోనూ, ఎట్టి పరిస్థితుల్లోనూ అవినీతిని ఉపేక్షించరాదు'' అని జస్టిస్ బీఎస్ చౌహాన్, జస్టిస్ దీపక్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది.

 గుజరాత్ రాస్త్రనికి చెందిన మునిచిపల్ ఉద్యొగులు నరెంద్ర చంపక్ లాల్, హర్జిభై దెవ్జిభై 1994 లొ గజెంద్ర జగదిష్ జెడీజ అనే వ్యక్థి నుంచి ఈ మొత్తం పుచ్చుకొన్నారు. భవ్నగర్ లొని పురపాలక సంఘ కార్యలయంలొ ఈ మొత్తం తీసుకొంటుండగా 1994 మార్చ్ 15 న వీరిని అర్రెస్ట్ చెసారు.ట్రైల్ కొర్ట్  వీరికి 6 మాసాలు ఖైదు విధించింది.

Thursday, May 24, 2012

ఊరికో బెల్టుషాపు..



మద్యం షాపులపై ఏసీబీ దాడులు అధికం కావడంతో రెండు నెలలుగా లెసైన్సు ఉన్న షాపుల్లో ఎమ్మార్పీకే విక్రయిస్తున్నారు. ఇలాగైతే లాభాలు రావడం లేదని గ్రహించిన వ్యాపారులు బెల్టుషాపుల్లో మద్యం విక్రయాలను పెంచారు. ఎక్సైజ్ అధికారుల లెక్కల ప్రకారం పదివేలకు పైగా బెల్టుషాపుల ద్వారా మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. మద్యం షాపుల్లో కన్నా బెల్టుషాపుల్లోనే అధికంగా విక్రయాలు జరుగుతున్నాయి. ఎమ్మార్పీ కన్నా ఇక్కడ ఐదు రూపాయలు అదనంగా క్వార్టర్ బాటిల్‌కు వసూలు చేస్తున్నారు. రాష్ట్రం లోని అన్ని పంచాయతీల్లోను ఒకటి, రెండు చొప్పున బెల్టుషాపులున్నాయి. పట్టణ ప్రాంతాల్లో ప్రతి సెంటర్‌కు రెండేసి చొప్పున ఏర్పాటు చేశారు. దీంతో వ్యాపారులు ప్రాంతాలవారీగా బెల్టుషాపులను విభజించుకుని వ్యాపారం నిర్వహిస్తున్నారు.

పట్టించుకోని పోలీసులు..
గత నెలలో  అందరు డీఎస్పీలు బెల్టుషాపులను మూసివేయాలని హుకుం జారీ చేశారు. దీంతో పట్టణ ప్రాంతాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోని బెల్టుషాపులు పది రోజుల పాటు మూతపడ్డాయి. మే నెల ప్రారంభం నుంచి మళ్లీ తెరుచుకున్నాయి. ప్రారంభంలో ఉన్న పోలీసుల హడావుడి రానురాను తగ్గిపోవడం పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు తలుచుకుంటే ఏమైనా చేయగలరని ప్రజలు అనుకుంటున్న సమయంలోనే మళ్లీ బెల్టుషాపులు తెరుచుకోవడంతో అవాక్కవడం ప్రజల వంతయింది. మద్యం సిండికేట్లుగా వ్యవహరించే కొందరు వ్యక్తులు పోలీసులపై ఒత్తిడి తీసుకువచ్చి బెల్టుషాపులను మళ్లీ నడుపుతున్నారనే వాదన లేకపోలేదు. గత నెల 27న గిలకలదిండిలో ప్రజాపథం జరిగిన సమయంలో అక్కడ బెల్టుషాపు కారణంగా తాము పడుతున్న ఇబ్బందులపై మహిళలు అధికారులకు, ప్రజాప్రతినిధులకు విన్నవించుకున్నారు. పోలీసులే ఈ బెల్టుషాపుపై దాడిచేసి మూయించివేశారు. పట్టుమని పది రోజులు కాకుండానే మళ్లీ ఈ బెల్టుషాపులో మద్యం విక్రయాలు యథావిధిగా జరగడం విశేషం. కాలేఖాన్‌పేట వద్ద రెండు బెల్టుషాపులున్నాయి. ఓ బెల్టు షాపు పక్కనే ప్రయాణికుల విశ్రాంతికోసం కట్టిన షెడ్డు తాగుబోతులకు డెన్‌గా మారింది. రాత్రి ఏడు గంటలకల్లా ఈ షెడ్డు మందుబాబులతో నిండిపోతోంది.

అధిక ధరలకు విక్రయాలు...
మంగినపూడి బీచ్‌లో పర్యాటక శాఖ ఏర్పాటుచేసిన షాపులో అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్నా పట్టించుకునేవారే లేకుండా పోయారు. అన్ని షాపుల్లో ఎమ్మార్పీకే విక్రయాలు జరుగుతున్నా బీచ్‌లోని మద్యం షాపులో అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఎక్సైజ్ అధికారులు ఆవైపు చూసిన దాఖ లాలే లేవు. పోలీసులు, వ్యాపారులు కుమ్మక్కై బెల్టుషాపులను జోరుగా నడుపుతున్నారనే విమర్శలు ప్రజలనుంచి వ్యక్తమవుతున్నాయి.

Tuesday, May 15, 2012

C.Y. Chintamani

"తెలుగు వాడి ఖ్యాతి ప్రపంచానికి తెలిసిన తరువాతే తెలుగు వారికీ తెలుస్తుంది " .ప్రపంచ వ్యాప్తంగా కీర్తి ఆర్జించిన ఎందరూ మహానుబావులు ఇక్కడ నిరా దరణ కు గురి ఆతున్నారు                                                                                                                                                                                     ‘‘అవును... నా దృష్టిలో మీ విధానాలు స్వాతంత్య్రోద్యమానికి హానిచేసేవిగా ఉన్నాయి. సవరించుకోమని సంపాదకీయం ద్వారా కోరాను. నేను చేసింది తప్పని మీరు అనుకుంటే... ‘లీడర్’ పత్రికకు ఈ క్షణమే రాజీనామా చేస్తాను’’ అంటూ వెంటనే రాజీనామా లేఖను లీడర్ పత్రిక వ్యవస్థాపకులు మోతీలాల్ నెహ్రూకు నిబ్బరంగా అందజేసిన ధీశాలి సీవై చింతామణి. జర్నలిజం పట్ల చింతామణికున్న నిబద్ధతను చూసి అబ్బురపడ్డ మోతీలాల్, ఆయన సమర్పించిన రాజీనామాను తిరస్కరించారు. 1880 ఏప్రిల్ 10న విజయనగరంలోని పండిత కుటుంబంలో జన్మించిన చిర్రావూరి యజ్ఞేశ్వర చింతామణి, చిన్నప్పుడే తండ్రి మరణించడంతో మెట్రిక్యులేషన్‌కు మించి చదవకపోయినా ఆంగ్లభాషలో మంచి పట్టును సాధించి వర్తమాన రాజకీయాలపై ఆంగ్ల పత్రికలకు వ్యాసాలు రాసేవారు. 18 ఏళ్ల పిన్న వయసులోనే ‘వైజాగ్ స్పెక్టేటర్’ పత్రికకు సంపాదకత్వం వహించారు. ది హిందూ, మద్రాస్ స్టాండర్డ్ వంటి పత్రికల్లో కొన్నాళ్లు పనిచేశారు. మోతీలాల్ నెహ్రూ, మదన్‌మోహన్ మాలవ్యా వ్యవస్థాపకులుగా ప్రారంభమైన ‘లీడర్’ పత్రికకు దశాబ్దాల పాటు సంపాదకత్వం వహించి భారతీయులనే గాక, బ్రిటిష్ పాలకులనూ మంత్రముగ్దులనుగావించారు.

‘‘చింతామణి సంపాదకీయాలు స్వాతంత్య్ర సమరయోధులను ఉత్తేజపరుస్తున్నాయి. ఆయన సూచనలు నాకెంతో ఉపకరిస్తున్నాయి’’ అని గాంధీతో ప్రశంసలందుకోవడం చింతామణికే సాధ్యమయింది. లీడర్ సంపాదకీయాలను బ్రిటిష్ అధికారులు కూడా శ్రద్ధగా చదివేవారు.

మంచి ఆంగ్ల పదాలను వాడీవేడిగా తన సంపాదకీయాల్లో సందర్భోచితంగానూ, సమతూకంగానూ రంగరించి వాడేవారు. చింతామణి పత్రికా సంపాదకులే కాక, మంచి వక్త కూడా. తాను చెప్పదలచిన అంశాన్ని శ్రోతల హృదయాలకు హత్తుకునేలా స్పష్టంగా చెప్పడం ఆయన ప్రత్యేకత. ఆ కాలంలో అలహాబాద్‌లో జరిగిన అన్ని సాహిత్య, సాంస్కృతిక సభల్లో చింతామణి పేరు ప్రముఖంగా కనిపించేదన్నది ఇప్పటికీ గుర్తుచేసుకునే వారు ఉన్నారు. సభల్లో వితంతు వివాహాలను ప్రోత్సహించి, అంటరానితనం, మూఢనమ్మకాలను తీవ్రంగా విమర్శించేవారు. ఉపన్యాసాలకే పరిమితం కాక, వితంతువైన కృష్ణవేణిని చింతామణి వివాహం చేసుకుని ఆదర్శప్రాయంగా నిలిచారు. ఉమ్మడి మదరాసు రాష్ట్రంలో 15 సంవత్సరాల పాటు శాసనమండలి సభ్యులుగా పనిచేశారు. ఆనాటి యునెటైడ్ ప్రావిన్సెస్‌కు విద్యా మంత్రిగా కొంత కాలం కొనసాగారు. లండన్‌లో జరిగిన మొదటి రౌండ్‌టేబుల్ సమావేశాలకు చింతామణి ప్రతినిధిగా హాజరయ్యారు. ఆయన ప్రతిభకు మెచ్చిన బ్రిటిష్ ప్రభుత్వం ‘సర్’ బిరుదుతో సత్కరించింది. బెనారస్ హిందూ యూనివర్సిటీ వీరికి గౌరవ డాక్టరేట్ బహుకరించింది. లీడర్ పత్రిక ద్వారా యావత్ భారతావనిలో గొప్ప సంపాదకుడుగా పేరు ప్రఖ్యాతులు గడించి ‘పోప్ ఆఫ్ ఇండియన్ జర్నలిజం’గా వేనోళ్ల కీర్తినొందిన సీవై చింతామణి 1941 జూలై 1న తుదిశ్వాస విడిచారు.
మనం మరచిపోయిన చింతామణి ని ఉత్తర ప్రదేశ్ గురవించింది. ఆ రాస్తాం లోని అల్లహాబాద్ నగరం లో చింతామణి కాలనీ ,చింతామణి రోడ్ అని అయన జ్ఞాపకార్ధం నేలకోల్పారు. మన జర్నలిస్ట్ సంఘాలు ఇప్పటికైనా అయన వర్ధంతి, జయంతి కార్యక్రమాలు చేపడితే ముదావహం. 







Previous Next
   

Archives

May 2012
Apr 2012
Mar 2012
Feb 2012
Jan 2012
Dec 2011


Sakshi Toolbar